బంజారాహిల్స్ : వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలో పలు అభివృద్ది పనుల కోసం నిధులు మంజూరు చేయాలంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ను కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి కోరారు.
గురువారం డివిజన్కు చెందిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే దానం నాగేందర్ను కలిసిన కార్పొరేటర్ డివిజన్లో చేపట్టాల్సిన సీసీ రోడ్డుపనులు, సివరేజీలైన్ పనులకు సంబందించిన ప్రతిపాదనలు అందజేశారు.
ఆయా ప్రాంతాల్లో చేపట్టాల్సిన పనుల కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. దీనికి ఎమ్మెల్యే దానం నాగేందర్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ ప్రధాన కార్యదర్శి మాదాస్ ఆనంద్కుమార్, ఆంథోనీ, నవీద్, అక్రమ్, అశ్వక్ తదితరులు పాల్గొన్నారు.