బంజారాహిల్స్ : జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్లోని జానీ జైల్సింగ్నగర్ బస్తీలో ప్రమాదకరంగా ఉన్న హైటెన్షన్ వైర్లను తొలగించేందుకు నిధులు మంజూరయ్యాయని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. మంగళవారం తన నివాసంలో బస్తీకి చెందిన నాయకులతో ఎమ్మెల్యే దానం నాగేందర్ సమావేశమయ్యారు.
గత కొంతకాలంగా హైటెన్షన్ వైర్ల సమస్యలను గురించి స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నారని, ఈ సమస్యను పరిష్కరించేందుకు తన నియోజకవర్గ అభివృద్ది నిధులనుంచి రూ.1.47లక్షలను మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ పనులకు సంబంధించిన నిధుల మంజూరు పత్రాలను బస్తీవాసులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు చంద్రశేఖర్, నాయకులు కిరణ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.