బన్సీలాల్ పేట్, మార్చి 31 : పరీక్షలు రాసి, వేసవి సెలవుల్లో ఉన్న విద్యార్థులు, నిరుద్యోగులకు సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఉచిత నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని జనహిత సేవా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఎస్.నరసింహమూర్తి తెలిపారు. ముషీరాబాద్ చౌరస్తా సమీపంలో భోలక్ పూర్ వద్ద ఉన్న తమ శిక్షణ కేంద్రంలో 30 రోజుల పాటు ఇచ్చే శిక్షణలో ఏసీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్, ఎయిర్ కూలర్, గీజర్ల రిపేరింగ్ నేర్పిస్తామన్నారు.
15 రోజులపాటు హోమ్ క్లీనింగ్ కోర్సు గురించి శిక్షణ ఇచ్చి, అనంతరం సర్టిఫికెట్ కూడా అందిస్తామన్నారు. వయో పరిమితి లేదని, ఆసక్తి గల వారు ఎవరైనా చేరవచ్చని సూచించారు. పరీక్షలు రాసి వేసవి సెలవులు ఉన్న విద్యార్థులు ఈ శిక్షణకు హాజరై సమయం సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఇతర వివరాలకు ఎం.శ్రీనివాస్, సెల్ నెంబర్ 81068 87523 లో సంప్రదించాలన్నారు.