జూన్ 15 వరకు పొడిగింపు
నాణ్యతగల వైద్య, ఆరోగ్య సేవలను అందించేందుకు షాదాన్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మెగా వైద్యశిబిరాన్ని జూన్ 15వరకు పొడిగించామని షాదాన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సారిబ్ రసూల్ ఖాన్ తెలిపారు. హిమాయత్ సాగర్ రోడ్డులోగల షాదాన్ హాస్పిటల్లో ఈ నెల 23న ప్రారంభమైన మెగా ఆరోగ్య శిబిరానికి విశేష స్పందన లభిస్తోందని, మరింత మందికి ఆరోగ్య సేవలను అందించేందుకు ఈ క్యాంపును పొడిగించామని ఆయన అన్నారు. రంగారెడ్డి జిల్లాల వారికీ ఈ క్యాంపులో వైద్య సేవలందించేందుకు ఏర్పాట్లు చేశామని ఆయన అన్నారు. విజారత్ రసూల్ ఖాన్ సొసైటీ సెక్రటరి షాదాన్, సొసైటీ వైస్ ఛైర్మన్ ఏజాజుర్రహ్మాన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సారిబ్ రసూల్ ఖాన్ పర్యవేక్షణలో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ 20వేలకు పైగానే రోగులకు వైద్యసేవలందించామని ఆయన అన్నారు. 5-7వేల మంది రోగులు ఇన్ పేషెంట్లుగా చేరి వైద్యచికిత్సలు పొందుతున్నారన్నారు. సూపర్ స్పెషాలిటీ సేవలు సైతం ఉచితంగా అందించడం ఈ మెగా హెల్త్ క్యాంపు ప్రత్యేకత. చెవి, ముక్కు, గొంత, కంటి, గుండె, ఆర్ధోపెడిక్, మూత్రపిండాల, గ్యాస్ట్రో, యూరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, ఆంకాలజీ తదితర ఉచిత సేవలు అందిస్తున్నారు. 500కు పైగా ఆపరేషన్లు నిర్వహించారు. మోకాలి రీప్లేస్ మెంట్, కంటి ఆపరేషన్లు, ఎముకల సర్జరీ, స్త్రీల సమస్యలు, ప్రసవాలు, సిజీరియన్లు అన్నీ ఉచితంగా చేస్తున్నారు. ఎమ్మారై, సీటీ స్కాన్, ఈసీజీ, అల్ట్రా సౌండ్ పరీక్షలు ఫ్రీగా చేస్తున్నారు. బ్లండ్ బ్యాంక్, ఆంబులెన్స్ సౌకర్యమూ ఉంది, ఉచితంగా మందులూ అందిస్తున్నారు. రోగులకోసం ఉచిత భోజన వసతి కల్పిస్తున్నామని సారిబ్ రసూల్ ఖాన్ చెప్పారు. చుట్టు ప్రక్కల ప్రాంతాల వారికి రవాణా సౌకర్యమూ కల్పించామని ఆయన అన్నారు. 9000988544, 9676311747, 8686285796, 9849019535,9885751975, 9985230806, 9966112448, 630465569, 986606046 నంబర్లకు సంప్రదించాలని కోరారు.