కవాడిగూడ, సెప్టెంబర్ 12: రజకులకు ఉచిత కరెంట్ను ఇవ్వడంతో పాటు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు నిర్ణయించడం హర్షణీయమని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల రజక దోబీ అభివృద్ధి సంస్థ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ ఎం.అంజయ్య, తెలంగాణ రాష్ట్ర చైర్మన్ బొమ్మరాజు కృష్ణమూర్తి అన్నారు. ఈ మేరకు ఆదివారం కవాడిగూడలోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో వెనుకబడిన రజకుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఉచిత కరెంట్ను ఇచ్చి సముచిత న్యాయం చేశారని అన్నారు. ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై ప్రతిష్ఠించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ. అశోక్, గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ ఎం. నర్సింహులు, తెలంగాణ రాష్ట్ర యువసేన చైర్మన్ జె. రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.