Students | సిటీబ్యూరో, ఫిబ్రవరి 29 ( నమస్తే తెలంగాణ ) : పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడికి గురవుతుంటారు. ఆందోళనకు గురై పరీక్ష రాయడంలో తడబడుతుంటారు. చదివింది గుర్తుండడం లేదని ఆందోళన చెందుతుంటారు. టెన్షన్తో నిద్ర సరిపడా లేక మరింత నీరసించిపోతుంటారు. ఇలాంటి పరిస్థితులతో విద్యార్థుల్లో ఆత్మైస్థెర్యం దెబ్బతిని పరీక్ష శ్రద్ధగా రాయలేకపోతుంటారు.
అలాంటి వారిలో మానసిక ైస్థెర్యం నింపేందుకు తెలంగాణ సైకాలజిస్టు అసోసియేషన్ ముందుకొచ్చింది. మార్చి నెల పరీక్షల సమయం కావడంతో ఉచితంగా విద్యార్థులకు కౌన్సెలింగ్ సేవలు ప్రారంభించారు. పరీక్షలకు సంబంధించి ఆందోళనకు గురయ్యే వాళ్లు సైకాలజిస్టులతో మాట్లాడితే మనసుకు ప్రశాంతత చేకూరుతుందని.. తద్వారా ఆత్మైస్థెర్యం పెరిగి పరీక్ష బాగా రాయడానికి దోహదపడుతుందని అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ మోత్కూరి రామచందర్ తెలిపారు.