సిటీబ్యూరో, జూలై 22 (నమస్తే తెలంగాణ) : టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎం రఘుమా రెడ్డి పేరిట గుర్తుతెలియని అగంతకుడు వాట్సాప్ నంబరుకు ఆయన ఫేక్ ప్రొఫైల్ పిక్చర్ను పెట్టుకున్నాడు. దీనిద్వారా ఆ సంస్థ ఉద్యోగులు, అధికారులకు మెసేజ్లు పంపుతున్నాడు.
ఈ విషయాన్ని గుర్తించి అధికారులు అందరినీ అప్రమత్తం చేశారు. అగంతకుడు వాడే మొబైల్ నంబర్లకు రఘుమా రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని, ఆ నంబర్లతో డబ్బులు, ఇతర ప్రయోజనాల కోసం వాడే అవకాశం ఉన్నదని అధికారులు పేర్కొన్నారు.