శంషాబాద్ రూరల్, సెప్టెంబర్ 29 : కోట్లాది రూపాయాలతో శంషాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. శుక్రవారం రూ. 5.70 కోట్లతో శంషాబాద్ మున్సిపాలిటీ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మామహేందర్రెడ్డి, వైస్ చైర్మన్ బండి గోపాల్యాదవ్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ శంషాబాద్ మున్సిపాలిటీకి తన నిధులతో పాటు, హెచ్ఎండీఏ, మున్సిపల్శాఖ నుంచి భారీగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. సీసీరోడ్లు, తాగునీరు, అంతర్గత రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు తదితర అభివృద్ధి పనులు చేశామని వివరించారు. శంషాబాద్ మున్సిపాలిటీ జిల్లాలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి అవసరమైన నిధులు కేటాయించి పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో శంషాబాద్ పట్టణాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. పట్టణ ప్రగతి నిధులతో శంషాబాద్ మున్సిపాలిటీలోని 25 వార్డులను దశల వారీగా అభివృద్ధి పనులు చేశామన్నారు. మరిన్ని అభివృద్ధి పనులు చేయడానికి అవసరమైన నిధులు కేటాయిస్తానని తెలిపారు. జాతీయ రహదారి నుంచి కాముని చెరువు వెళ్లడం కోసం రోడ్డులేక ఏండ్ల కాలంగా ప్రజలు సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడేవారని గుర్తు చేశారు. నూతన రోడ్డువేసి సమస్యను పరిష్కారం చేశామని వివరించారు. శంషాబాద్ పట్టణంలో అనేక సమస్యలను పరిష్కారం చే సి ప్రజలకు ఇబ్బందు లు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గణేశ్గుప్త,మున్సిపల్ చైర్పర్సన్ సుష్మామహేందర్రెడ్డి, వైస్ చైర్మన్ బండి గోపాల్యాదవ్,నార్సింగి మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్ గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి, కౌన్సిలర్లు అజయ్, మేకల వెంకటేశ్ముదిరాజ్,ఆయిల్కుమార్, చెన్నం అశోక్, సంజయ్యాదవ్, కొండ ప్రవీణ్గౌడ్, భద్రునాయక్,రేఖగుప్త, అమృతారెడ్డి,కొన్నమొల్ల భారతమ్మ,విజయలక్ష్మి,బండి భాగ్యలక్ష్మి, కో-ఆప్షన్ సభ్యురాలు సంతోష, కవిత,అస్లాం, నాయకులు కొన్నమొల్ల శ్రీనివాస్,ప్రవీణ్గౌడ్, శ్రీనివాస్గౌడ్,తాజ్బాబా,అజాంద్, దీపమల్లేశ్, ప్రభాకర్, నరేందర్గౌడ్,హన్ముంతు ముదిరాజ్లతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
బండ్లగూడ,సెప్టెంబర్ 29: ముస్లింల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ పేర్కొన్నారు. రాజేంద్రనగర్ నియోకవర్గం పరిధిలోని నిరుపేద ముస్లిం మహిళలకు 180 కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అర్చనజయప్రకాశ్,శంషాబాద్ మున్సిపల్ చైర్మన్ సుష్మామహేందర్రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్గౌ డ్,కౌ న్సిల్ జాగీర్ఖాన్, మైనార్టీ నేత మునిరాబే గం,ముజాహిద్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ధర్మారెడ్డి, మహేశ్, సులేమన్, నయీమొద్దీన్, శాస్త్రిపురం బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.