సిటీబ్యూరో, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): ఫార్ములా ఈ-రేసింగ్ ప్రాక్టీస్తో సాగరతీరం హోరెత్తింది.. శుక్రవారం ఐమ్యాక్స్ థియేటర్, హుసేన్ సాగర్, తెలంగాణ కొత్త సచివాలయం, మింట్ కాంపౌండ్ మీదుగా ప్రాక్టీస్ రేసింగ్ నిర్వహించారు. ప్రాక్టీసే కదా అనుకున్నా.. పవర్ ఫుల్గా సాగాయి ఈ-రేసింగ్ పోటీలు. సెకన్లలోనే జెట్ స్పీడ్ను అందుకునే విద్యుత్ వాహనాలు.. 2.8 కిలో మీటర్ల నిడివి కలిగిన ట్రాక్పైదూసుకుపోయాయి.
నగరంలోని బిట్స్ పిలానీ, లయోలా, వీబీఐటీ కళాశాల విద్యార్థులతో రేసింగ్ ప్రాంగణంలో సందడి నెలకొంది. వలంటీర్లుగా సుమారు ప్రతి కళాశాల నుంచి దాదాపుగా 500 మంది విద్యార్థిని, విద్యార్థులు విచ్చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ-రేసింగ్లో పలు దేశాల నుంచి పలవురు రైడర్లు పాల్గొంటున్నారు. బెల్జియం, ఫ్రాన్స్, బ్రెజిల్, యునైటెడ్ కింగ్డం, నెదర్లాండ్స్, సౌత్ ఆఫ్రికా, స్విట్జర్లాండ్, జర్మనీ, న్యూజిలాండ్, పోర్చుగల్ దేశాలు పాలుపొంచుకుంటున్నాయి.
హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకొని ప్రతిష్టాత్మక ఈవెంట్ను నిర్వహించడం గొప్ప విషయం. ముఖ్యమంత్రి కేసీఆర్కే ఈ ఘనత దక్కుతుందని చెప్పాలి. తాను పలు రేసింగ్ ఈవెంట్లకు హాజరైనట్లు నమ్రత పేర్కొన్నారు. కానీ, ఫార్ములా ఈ-రేస్ను చూడటం మొదటి సారని పేర్కొన్నారు. గ్రీన్కో కంపెనీ చాలా ప్రతిష్టాత్మకంగా రేస్ను నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నది. అందరికి అభినందనలు అని ఆమె నమస్తే తెలంగాణతో తెలిపారు.
ప్రాక్టీస్ ఈ-రేసింగ్కు శుక్రవారం ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, ఐఏఎస్ అధికారి హరిచందన, ప్రముఖ నటుడు మహేశ్బాబు భార్య, నటి నమ్రతా శిరోద్కర్, ఆయన తనయుడు గౌతం, జూనియర్ ఎన్టీఆర్ సతీమణి ప్రణవి, నారా లోకేశ్ సతీమణి బ్రాహ్మణి, గ్రీన్కో చైర్మన్ సీహెచ్ అనిల్, ఎండీ కె.మహేశ్ తదితరులు హాజరై ఈ-రేసింగ్ ప్రాక్టీస్ మ్యాచ్ను తిలకించారు.