రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ప్రాంతంలోని శ్రీశైలం ప్రధాన రహదారిపై మంగళవారం ఓ దివ్యాంగ వృద్ధుడు ఫిట్స్ వచ్చి గిలగిలా కొట్టుకుంటున్నాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రారెడ్డి ఆ వృద్ధుడిని గమనించి అతని దగ్గరికెళ్లారు.
కారు దిగి స్వయంగా తన సిబ్బందితో కలిసి వృద్ధుడిని సాధారణ స్థితికి తెచ్చారు. అనంతరం వృద్ధుడి పూర్తి వివరాలు అడగగా.. తనది ఆమనగల్ అని, పేరు ఎల్లయ్య అని చెప్పాడు. అతనికి కొంత నగదు ఇచ్చి ఆటోలో పంపించి మానవత్వం చాటుకున్నారు.