మేడ్చల్, మే 26 : అమెరికా తెలంగాణ తెలుగు అసోసియేషన్ సభల్లో మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. 2006-10 బ్యాచ్ సీఎంఆర్ విద్యార్థి చందు రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సభలో మల్లారెడ్డితో పాటు సీఎంఆర్ విద్యా సంస్థల చైర్మన్ గోపాల్రెడ్డి, సినీ నిర్మాత దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన తెలంగాణ తెలుగు వారిని ఉద్దేశించి, స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. జీవితంలో విజయం సాధించాలంటే కష్టపడాలని సూచించారు. ఏఈ, డేటా సైన్స్ తదితర నూతన సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి సారించి, పట్టుదలతో శ్రమిస్తే విజయాన్ని సొంతం చేసుకోవచ్చన్నారు.