కాప్రా, జనవరి 4: ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్ని తప్పక నెరవేరుస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. మల్లాపూర్లోని స్వాగత్ కన్వెన్షన్హాలులో ఉప్పల్ నియోజకవర్గం ముస్లిం మైనార్టీలు ఉప్పల్ బీఆర్ఎస్ మైనార్టీ విభాగం అధ్యక్షులుఎం.కే.బద్రుద్దీన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మైనార్టీ సంక్షేమం, అభివృద్ధికోసం ప్రత్యేకంగా మైనార్టీ వింగ్ ఏర్పాటు చేస్తానన్నారు.ఎన్నికల్లో తనకోసం కష్టపడిన మసీదు కమిటీ, దర్గా కమిటీల పెద్దలకు, అసోసియేషన్లు, యూత్కు, మహిళలకు తాను రుణపడి ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం పరిధిలోని ముస్లిం పెద్దలు, మసీదు కమిటీ, దర్గా కమిటీపెద్దలు, యూత్ ప్రతినిధులు, మహిళలు, స్థానికులు పాల్గొన్నారు.
చర్లపల్లి: ఉప్పల్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఏఎస్రావునగర్ డివిజన్ పరిధిలోని ఏఎస్రావునగర్లో ఈసీఐఎల్ ఎప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో డాక్టర్ ఏఎస్రావు చిత్రపటానికి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఆయనను సొసైటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఎస్రావునగర్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సోమశేఖర్రెడ్డి, మాజీ కార్పొరేటర్లు రామారావు, పావనీమణిపాల్రెడ్డి, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు మహిపాల్రెడ్డి, సోసైటీ అధ్యక్ష, కార్యదర్శులు రాజేశ్వర్రావు, రామమూర్తి, ఉపాధ్యాక్షుడు సంగ య్య, డైరక్టర్లు కృష్ణమూర్తి, సోమయ్యచారి, విజయ్కుమార్, రాంచందర్లతో పాటు కాలనీవాసులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఉప్పల్: ఆశవర్కర్ల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతన సంవత్సర వేడుకలు, సన్మాన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆశవ ర్కర్ల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారా నికి చర్యలు చేపడతామన్నారు. ప్రజల కోసం పనిచేస్తూ, ప్రజాదరణ పొందాలన్నారు.ఈ కార్యక్రమంలో వైధ్యాధికారిణి డా.సౌందర్యలత, సూపర్వైజర్ బోగ ప్రకాశ్, గొంగడయ్య, కరుణాదేవి, యాదమ్మ, ఏఎన్ఎం, ఆశకార్యకర్తలు, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.