సిటీబ్యూరో, మే 6 (నమస్తే తెలంగాణ) : ప్రయాణికుల సౌకర్యం కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని పదో నంబర్ ప్లాట్ఫామ్ పై అత్యవసర ఉచిత వైద్య సేవల కేంద్రాన్ని రైల్వే అధికారులు ప్రారంభించారు. ఎస్సీఆర్కు చెందిన ప్రిన్సిపల్ చీఫ్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సి. వెంకటేశ్వర్లు, సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ అభయ్కుమార్ గుప్తా, సికింద్రాబాద్ డివిజన్ చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నిర్మలా రాజారామ్, అదనపు రైల్వే మేనేజర్ ప్రదీప్ కుమార్ సింగ్ రాథోడ్ తదితరులు వైద్య కేంద్రాన్ని ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్లాట్ఫామ్ పై 24/7 వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.