ప్యారడైజ్ మార్గంలోని సుచిత్ర నుంచి కొంపల్లి వరకు నిర్మిస్తున్న ఎక్స్ప్రెస్ వే సుదీర్ఘకాలంగా కొనసాగుతూనే ఉన్నది. నిత్యం లక్షలాది రాకపోకలు సాగించే ఈ మార్గంలో ఫ్లైఓవర్ పనులతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో పిల్లర్ను నిర్మించేందుకు కోట్లలో ఖర్చు చేశారు.. అయితే వాటిని కరెంట్ స్తంభాల్లా.. వీధి దీపాలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. సోషల్మీడియాలో ఫొటో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇవీ వీధి దీపాల స్తంభాలా.. మేము పొరపాటున ఫ్లై ఓవర్ అనుకున్నామే’.. అంటూ..సెటైర్లు వేస్తున్నారు. ఆర్అండ్బీ అధికారులపై మండిపడుతున్నారు.
-సిటీబ్యూరో