మియాపూర్ : హైదర్నగర్ డివిజన్ పరిధిలోని నందమూరినగర్ నుంచి నిజాంపేట రోడ్డు వరకు చేపడుతున్న వరద నీటి కాలువ పనులను కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్లతో కలిసి విప్ గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద కాలువ నిర్మాణానికి నెలకొన్న ఆటంకాలను పరిష్కరించినట్లు, పనులలో వేగం పెంచి నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.
వర్షాకాలం నేపథ్యంలో వరద కాలువల ద్వారా ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని గాంధీ అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి తాను అహర్నిషలు కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈ రాజీవ్, కాలనీ వాసులు పాల్గొన్నారు.