సుల్తాన్బజార్, సెప్టెంబర్ 23: ‘నమస్తేతెలంగాణ-తెలంగాణ టుడే’ సంయుక్తాధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా బొనాంజా ఉత్సవాల్లో భాగంగా రెండోరోజు శుక్రవారం హైదర్గూడలోని లక్ష్మీ నిస్సాన్ షోరూమ్లో లక్కీ డ్రా తీసి.. ఐదుగురు విజేతలను ఎంపిక చేశారు. ఈ డ్రాలో బండ్లగూడ జాగీర్ అమృత ఎవెన్యూకు చెందిన సోమ గిరిబాబు మొదటి బహుమతి గెల్చుకోగా, భూమయ్యకు రెండో బహుమతి, లక్ష్మికి మూడో బహుమతి, బాలాజీకి నాలుగో బహుమతి, ఆదిత్య ఐదో బహుమతి గెలుపొందారు. ఈ సందర్భంగా లక్ష్మీ నిస్సాన్ జనరల్ మేనేజర్ వేణు వినోద్ మాట్లాడుతూ ‘నమస్తే తెలంగాణ-తెలంగాణటుడేల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా బొనాంజా ఉత్సవాల్లో తాము భాగస్వామ్యులు కావడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో లక్ష్మీ నిస్సాన్ సేల్స్ మేనేజర్ బి. రమేశ్రెడ్డి, నమస్తేతెలంగాణ చీఫ్ జనరల్ మేనేజర్(ఆపరేషన్స్) సీహెచ్ శ్రీనివాస్, అడ్వర్టయిజింగ్ విభాగం ఏజీఎంలు రాజిరెడ్డి, రామకృష్ణ యాదవ్, మేనేజర్ చరణ్ తదితరులు పాల్గొన్నారు.
విశేష స్పందన
‘నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా బొనాంజా పాఠకులు, ప్రకటనకర్తలకు మరింత దగ్గరయ్యేందుకు దోహదం చేస్తుంది. ఈ లక్కీడ్రాకు విశేష స్పందన లభిస్తుండటంతో వచ్చే ఏడాది మరింత పెద్ద ఎత్తున నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం.
-సీహెచ్ శ్రీనివాస్, చీఫ్ జనరల్ మేనేజర్(ఆపరేషన్స్) నమస్తే తెలంగాణ
లక్కీ డ్రాలో టీవీ వచ్చింది
దసరా పండుగ షాపింగ్కు వెళితే 32 ఇంచుల కలర్ టీవీ లక్కీ డ్రాలో గెలుచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. నాకు ఫోన్ చేసి.. లక్కీ డ్రాలో మొదటి విజేతగా నిలిచావని ‘నమస్తే తెల ంగాణ’ సిబ్బంది చెప్పడంతో తొలుత కొంత ఆశ్చర్యపోయా.. ఆ తర్వాత చాలా ఆనందంగా ఫీల్ అయ్యా. దసరా బొనాంజాలో ప్రతి ఒక్కరూ పాల్గొని లక్కీ డ్రాలో విజేతలుగా నిలువాలని ఆకాంక్షిస్తున్నా.
-సోమ గిరిబాబు, బండ్లగూడ జాగీర్
ఉత్తమ సేవలందించేందుకే..
వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నాం. ‘నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే’ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా బొనాంజాలో భాగస్వాములను చేసి మా వినియోగదారులకు బహుమతులను అందించడం సంతోషంగా ఉంది. బంపర్ బొనాంజాలో లక్ష్మీ నిస్సాన్ మాగ్నైట్ కారును అందిస్తాం.
-కె వేణు వినోద్, లక్ష్మీ నిస్సాన్, జనరల్ మేనేజర్