హైదరాబాద్: హైదరాబాద్ రాజేంద్రనగర్ (Rajendra Nagar) శివార్లలోని మైలార్దేవ్పల్లిలో భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. మైలార్దేవ్పల్లిలోని (Mailardevpally) టాటానగర్లో ఉన్న ఓ ప్లాస్టిక్ గోదామ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి గోదామ్ మొత్తానికి విస్తరించడంతో పెద్ద ఎత్తున్న అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో భారీగా పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. నాలుగు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
అగ్నిప్రమాదం ధాటికి గోదామ్ మొత్తం దగ్ధమయిందని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాదేదన్నారు. ఎవరూ లేని సమయంలో మంటలు అంటుకోవడంతో ప్రాణనష్టం జరుగలేదని చెప్పారు. భారీగా ఆస్తి నష్టం జరిగిందని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.