హైదరాబాద్: నగరంలోని జగద్గిరిగుట్టలో అగ్నిప్రమాదం జరిగింది. జగద్గిరిగుట్టలోని ఓ బట్టల దుకాణంలో గురువారం ఉదయం మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి దుకాణం మొత్తానికి విస్తరించాయి. గుర్తించిన స్థానికులు మంటలను ఆర్పివేశారు. అయితే ఎవరో కావాలనే నిప్పంటించినట్లు షాపు యజమాని నవీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అక్కడ అగ్గిపెట్టెను గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. దుకాణంలోని రూ.7 లక్షల విలువైన దుస్తులు దగ్ధమయ్యాయని నవీన్ తెలిపారు.