ఎల్బీనగర్, జనవరి 21: ఎల్బీనగర్ మూడు సర్కిళ్ల పరిధిలో శుక్రవారం నుంచి ఇంటింటికీ జ్వర సర్వే ప్రారంభమయ్యింది. కరోనాను అరికట్టడంలో భాగంగా ఇంటింటికీ జ్వర సర్వే నిర్వహించి ఎవరికైనా జ్వరం ఉంటే అక్కడి కక్కడే మందులను ఇవ్వడంతో పాటుగా అవసరమైన వారిని దవాఖానలకు పంపి చికిత్స చేయించే కార్యక్రమాలను చేపడుతున్నారు. శుక్రవారం ఎల్బీనగర్జోన్ పరిధిలోని హయత్నగర్, ఎల్బీనగర్, సరూర్నగర్ సర్కిళ్ల పరిధిలో జ్వర సర్వేను నిర్వహించారు.
సరూర్నగర్ సర్కిల్లో..
సరూర్నగర్ సర్కిల్ పరిధి కొత్తపేట డివిజన్లోని కమర్షియల్ టాక్స్ కాలనీ, చైతన్యపురి డివిజన్లోని భవానీనగర్, న్యూ మారుతీనగర్, ఇందిరానగర్, సాయినగర్ కాలనీల్లో, గడ్డిఅన్నారం డివిజన్లోని కోదండరాంనగర్ కాలనీలో జ్వర సర్వే నిర్వహించారు. సరూర్నగర్ సర్కిల్లోని ఐదు డివిజన్లలో కలిపి మొత్తం 714 నివాసాల్లో జ్వర సర్వే నిర్వహించగా 76 మందికి జ్వరం ఉన్నట్లు గుర్తించారు. వారికి మందుల కిట్లను ఇచ్చారు. మరో 179 మంది వ్యాక్సిన్ వేయించుకునేందుకు అర్హులు ఉన్నట్లుగా సర్వేలో గుర్తించారు. వెంటనే వ్యాక్సిన్ చేయించుకోవాలని వారికి సూచించారు.
ఎల్బీనగర్ సర్కిల్లో ..
ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలోని వనస్థలిపురం డివిజన్లో గుండి జంగయ్య కాలనీ ఫేజ్ 1, 2, చింతలకుంట గ్రామం, జహంగీర్నగర్ కాలనీ, హస్తినాపురం డివిజన్లోని ఆదర్శనగర్ కాలనీ, సుభాష్చంద్రబోస్కాలనీ, రోషన్ దౌలా, చంపాపేట, నందనవనం, భూపేష్గుప్తానగర్, పోచమ్మగడ్డ, ఇంద్రసేనారెడ్డినగర్, చంపాపేట డివిజన్లోని చంపాపేట్ నేతాజీనగర్, చంపాపేట వీకర్సెక్షన్ కాలనీ, రెడ్డి బస్తీ, సుల్తాన్వల్వ, దాసరి బస్తీ, బైరామల్గూడ గ్రామం, కర్మన్ఘాట్ గ్రామం, లింగోజిగూడ డివిజన్లోని అధికారినగర్, లింగోజిగూడ, లింగోజిగూడ ఫేజ్ 1,2, ఎల్బీనగర్ వార్డు కార్యాలయం ప్రాంతం, తపోవన్ కాలనీ, అల్తాఫ్నగర్, ఎల్బీనగర్ పాత గ్రామం, కామేశ్వర్రావు కాలనీ, వడ్డెర బస్తీ, దానాపూరం, బహుదూర్గూడ పాత గ్రామం ప్రాంతాల్లో జ్వర సర్వేను నిర్వహించారు. ఇక్కడ నాలుగు డివిజన్లలో కలిపి మొత్తం 1581 నివాసాలకు జ్వర సర్వే నిర్వహించగా 86 మందికి జ్వరం ఉన్నట్లు గుర్తించి వారికి కిట్స్ ఇచ్చారు. మరో 115 మంది వ్యాక్సినేషన్ వేయించుకోవాల్సిన వారు ఉన్నట్లుగా గుర్తించారు. వారిని వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు.
హయత్నగర్ సర్కిల్లో
హయత్నగర్ సర్కిల్లోని నాగోలు డివిజన్లో బండ్లగూడ గ్రామం, మన్సూరాబాద్ డివిజన్లో మన్సూరాబాద్ పాతగ్రామం, వీకర్ సెక్షన్ కాలనీ, జయశ్రీకాలనీ, ఇందిరానగర్ ఫేజ్ 1, 2, హయత్నగర్ డివిజన్లో బం జారా కాలనీ, అంబేద్కర్నగర్, మాల బస్తీ, అన్మగల్, రంగనాయకుల గుట్ట , సుధీర్కుమార్ కాలనీ, ఖాస్బాగ్, తెనుగ బస్తీ, బీఎన్రెడ్డినగర్ డివిజన్ పటేల్ గూడ, సాహెబ్నగర్, వడ్డెరబస్తీ, వీకర్సెక్షన్ కాలనీ, సాహెబ్నగర్ పాతగ్రామం ప్రాంతాల్లో జ్వర సర్వే నిర్వహించారు. నాలుగు డివిజన్లలో మొత్తం 6220 నివాసాల్లో జ్వర సర్వే నిర్వహించారు. వీరిలో 191 మందికి జ్వరం ఉన్నట్లుగా గుర్తించి వారికి ఐసోలేషన్ కిట్స్ను అందజేశారు. సర్వేలో 418 మంది వ్యాక్సినేషన్ చేయించుకోవాల్సి ఉన్నవారిని గుర్తించారు.