వాగ్గేయకారులకు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఘన సత్కారం
తెలుగు యూనివర్సిటీ, మే 2: తెలంగాణ రాష్ట్ర సాధనలో పాటలు జనాల్ని జాగృతం చేసి ఉద్యమం వైపు నడిపించాయి.. అందుకు పాటకు వందనం.., పాటలతో ప్రజలను చైతన్యం చేసిన వాగ్గేయకారులను సన్మానించుకోవడం మన భాధ్యత అని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య టి.కి షన్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ వాగ్గేయకారులను తెలుగు యూనివర్సిటీ గురువారం ఘనంగా సత్కరించుకుంది. ప్రముఖ వాగ్గేయకారులు, శాసన మండలి సభ్యులు గోరటి వెంకన్న, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, సినీ గేయ రచయితలు సుద్దాల అశోక్ తేజ, జయరాజ్లను ఈ సందర్భంగా వర్సిటీ వీసీ కిషన్ రావు, రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్ సత్కరించారు.
ఎమ్మెల్సీ గోరటి వెంకన్న మాట్లాడుతూ, తెలియకుండా రాసేదే నిజమైన కవిత్వం అన్నారు. ప్రజల వద్దకు సాహిత్యం చేరాలని ఆకాంక్షించారు. సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ, తెలంగాణ మాండలికాన్ని ఉపయోగిస్తూ తెలంగాణ భాషకు సినిమాల్లో పట్టాభిషేకం చేశానని పేర్కొన్నారు. త్రిబుల్ ఆర్ సినిమాలోని ‘కొమురం భీముడో..’ పాట విదేశీయులను సైతం ఆకట్టుకున్నదని తెలిపారు. సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఉద్యమ ప్రస్థాన దశకు దోహదపడిన పా టలను, ఉపన్యాసాలను, వీధి నాటకాలను ఆయన గుర్తు చేశారు. గేయ రచయిత జయరాజ్ మాట్లాడుతూ, ఉద్యమానికి ఊతమిచ్చిన పాటల రచయితలను గుర్తిం చి సత్కరించడం సంతోషంగా ఉందన్నారు. విస్తరణ సేవా విభాగం ఇన్చార్జి రింగు రామ్మూర్తితో పాటు వర్సి టీ పీఠాధిపతులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.