అమీర్పేట్, జనవరి 14 : భారత ఆహార సంస్థ 59వ వ్యవస్థాపక దినోత్సవాన్ని సనత్నగర్లోని ఎఫ్సీఐ గిడ్డంగుల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఎఫ్సీఐ ఏజీఎం డాక్టర్ రాజన్కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు మంచిర్యాల జల్లా బెల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జి సోమాద్రి హిమబిందు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా వంటి తీవ్ర పరిస్థితుల్లో కూడా ఉద్యోగులు, సిబ్బంది దేశంలో ఆహార కొరత రాకూడదనే లక్ష్యంగా పని చేయడాన్ని అభినందించారు. అంతకు ముందు సోమాద్రి హింమబిందు సనత్నగర్ ఇన్స్పెక్టర్ ముత్తుయాదవ్తో కలిసి ఇక్కడి ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాన్ని ఎఫ్సీఐ సెక్యురిటీ విభాగం మేనేజర్ ఇ.సుధాకర్రావు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో సంస్థకు చెందిన ఎస్.కామాక్షి ప్రసాద్, చంద్రునాయక్, ఎం.మంజుల, అరుణ్, వి.నాయక్, బాలమణి, ఉద్యోగ కార్మిక సంఘాల నాయకులు సలీం అహ్మద్, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.