ఎర్రగడ్డ/ జూబ్లీహిల్స్, జనవరి 12: దివంగత మాజీ మంత్రి పీజేఆర్ జయంతిని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పలు చోట్ల, ఇంకా బోరబండ, ఎర్రగడ్డ డివిజన్లలో బీఆర్ఎస్ శ్రేణులు శుక్రవారం ఘనంగా నిర్వహించాయి. పీజేఆర్ విగ్రహాలు, చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బోరబండ డివిజన్ మధురానగర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. బస్తీ అధ్యక్షుడు ఎం.ఆనంద్ కుమార్ పీజేఆర్ విగ్రహానికి పూల మాల వేసి స్థానికంగా స్వీట్లు, పండ్లు పంచి పెట్టారు.
ఆనంద్ కుమార్తో పాటు సంక్షేమ సంఘం నేతలు సరళమ్మ, లావణ్యరెడ్డి, భారతి, యూనుస్, సలీమ్, శివకుమార్, తిరుపతయ్య, ప్రతాప్, కృష్ణారెడ్డి, యాదయ్య, దేవేందర్రెడ్డి, పవన్గౌడ్, హనీఫ్, ఓమర్, యూసుఫ్, లతీఫ్, షకీర్, నసీర్, సందీప్, అభిషేక్, రఫీక్, షరీఫ్అలీ, షబ్బీర్, రాంచందర్, ముజాహిద్, ఖాసీం పాల్గొన్నారు. ఎస్సార్టీనగర్లో డివిజన్ బీఆర్ఎస్ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు బొట్టు శివ, శ్రీధర్రెడ్డి, శ్రీకాంత్, వీరేష్, సంతోష్, నరసింహ, శంకర్, ముజామిల్, శ్రీధర్, పవన్ పీజేఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. యూసుఫ్గూడ డివిజన్లో భారీ ఎత్తున పీజేఆర్ విగ్రహానికి నివాళులర్పించారు.
హిమాయత్నగర్, జనవరి12: హిమాయత్నగర్ వై జంక్షన్లో పీజేఆర్ చిత్రపటానికి ఖైరతాబాద్ కార్పొరేటర్ పి.విజయారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం, కేక్ కట్ చేసి పలు సేవా కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సయ్యద్ జావీద్, దిలీప్రాజ్రెడ్డి, ముజ్జులాల్, జ్ఞానేశ్వర్, కమల, సంధ్యారాణి, నరేష్, నీలం శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.