బేగంపేట్, జూలై 28: ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం సవ్యంగా పూర్తిస్థాయిలో నిర్వహించడానికి మరో ఆరు నెలలు పొడిగించాలని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన వెస్ట్ మారేడ్పల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీ డియా సమావేశంలో మాట్లాడారు. ఆగస్టు 3 వ తేదీతో గడువు ముగుస్తున్నదని, కానీ ఇప్ప టి వరకు 40 శాతం మాత్రమే పూర్తయిందని అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయని పేర్కొన్నారు. మరో ఆరు రోజుల వ్యవధిలో ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. ఈ ప్రక్రియ అం తా గందరగోళంగా ఉందని, సిబ్బంది కూడా సరిపడా లేరన్నారు. ఎస్ఐఆర్ వేగవంతం కావడానికి సిబ్బందిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులను ఎస్ఐఆర్ విధుల్లో భాగస్వామ్యం చేసే లా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించాలని కో రారు. ప్రత్యేక ఓటరు సవరణలో 2002 నాటి వివరాలతో ఇప్పుడు ఏం అవసరమని ప్రశ్నించారు. నూతన ఓటర్ల నమోదు, ఓటును మ రో ప్రాంతానికి మార్చుకునే అవకాశం కల్పిస్తామని చెప్పి ప్రస్తుతం అవి చేయడం లేదన్నా రు. బూత్ లేవల్ ఏజెంట్ల సహకారంతోనే బీఎల్వోలు పని చేయగలిగారన్నారు. ఓటర్లు త మ బాధ్యతగా తమ పూర్తి వివరాలు నమోదు చేసి ఫారాలను బూత్ లెవల్ ఆఫీసర్లకు అందజేయాలని కోరారు. ఓటు తొలగించే పరిస్థితి రాకుండా చూసుకోవాలని సూచించారు. ఓటరు కార్డు గుర్తింపుగా కూడా ఉపయోగపడుతుదని తెలిపారు.
ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలి
ఎస్ఐఆర్ గడువు సమీపిస్తున్నందున ఇంటింటికీ వెళ్లి ఓటర్లు తమ వివరాలు సమర్పించేలా అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం మారేడ్పల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన నియోజకవర్గ పార్టీ నాయకులతో ఎస్ఐఆర్పై సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 3తో గడువు ముగుస్తుందని ఇప్పటి వరకు వివరాలు సమర్పించని ఓటర్లను గుర్తించి వారి ఇండ్లకు వెళ్లి అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఫారాలు సక్రమంగా అందజేయడం లేదని, కొరత ఉందని, పలువురు పార్టీ నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే జీహెచ్ఎంసీ కమిషనర్కు ఫోన్ చేసి విషయాన్ని వివరించారు. బీఎల్వోల వద్ద సరిపడా ఫారాలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని కమిషనర్ వివరించారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ మల్లిఖార్జున్గౌడ్, పార్టీ నాయకులు శ్రీనివాస్గౌడ్, శ్రీహరి, గుర్రం పవన్కుమార్గౌడ్, లక్ష్మీపతి, కిషోర్కుమార్, నాగులు, వెంకటేశం రాజు, మహేశ్యాదవ్, హన్మంతరావు, శేఖర్ముదిరాజ్, ఏసూరి మహేశ్ తదితరులు పాల్గొన్నారు.