చిక్కడపల్లి, జనవరి 21 : ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏసీపీ జి. శంకర్రాజు అన్నారు. ప్రమాదాలను నిరోధించడంలో యువత ప్రముఖ పాత్ర పోషించాలని ఆయన సూచించారు. శనివారం బాగ్లింగంపల్లి లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జూనియర్ కళాశాల విద్యార్థులకు ట్రాఫిక్పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. నగరంలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలు తగ్గుతాయని వివరించారు.
విద్యార్థులు నిబంధనలు ఉల్లంగిస్తే వారికి ఉద్యోగ అవకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. అన్ని శాఖల అధికారులతో కలిసి ట్రాఫిక్ సమ్యలు పరిష్కరిస్తున్నామని వివరించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు డ్రైవ్ చేస్తున్నారని, ఇది చాలా ప్రమాదం అని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలో విద్యార్థులు ముందుండాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి, వసుందర, రత్న, చిక్కడపల్లి ఎస్సై సుబ్బారావు, సిబ్బంది పాల్గొన్నారు.