రవీంద్రభారతి, సెప్టెంబర్ 13 : అంతరించి పోతున్న నాటక కళలను, కళాకారులను కాపాడుకోవాల్సిన అవసరం మనందరిపై ఉన్నదని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు. అభినయ థియేటర్ ట్రస్ట్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, సౌత్జోన్ కల్చరల్ సెంటర్ (తమిళనాడు) కేంద్ర సాంస్కృతిక శాఖల నిర్వహణలో గత మూడు రోజులుగా రవీంద్రభారతిలోని ప్రధాన కళావేదికపై కొనసాగుతున్న నాటకాల ప్రదర్శన బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా డాక్టర్ రమణాచారి మాట్లాడుతూ సంస్థ నిర్వాహకుడు అభినయ శ్రీనివాస్ వివిధ రాష్ర్టాల నుంచి కళాకారులను రప్పించి 17వ అభినయ జాతీయ బహు భాషా నాటకోత్సవాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో డా. ఎ.శ్రీనివాస్కుమార్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.