మణికొండ, మార్చి 29 : రాష్ట్రంలోనే అత్యధిక నిధులు కలిగిన నార్సింగి, మణికొండ మున్సిపాలిటీలు మరోసారి రికార్డుస్థాయిలో అభివృద్ధి పనుల కోసం అంచనాలకు కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. బుధవారం వేర్వురుగా జరిగిన మున్సిపాలిటీల సర్వసభ్య సమావేశాలను చైర్మన్ల అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశాలలో నార్సింగి మున్సిపాలిటీ రూ.119కోట్ల 50లక్షల 70వేల నిధులతో అభివృద్ధి పనులకు 2023-2024 ఏడాదికి అంచనా వ్యయంగా కౌన్సిల్ ఆమోదం తెలుపగా, మణికొండ మున్సిపాలిటీ రూ.56కోట్ల 33లక్షల నిధులతో పలు అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపింది. నార్సింగి మున్సిపాలిటీలో… పన్నులు వసూళ్లు రూ.292 కోట్లు, అద్దె పెనాల్టీ ఆదాయ వసూళ్లు, రూ.143కోట్ల్లు, ట్రేడ్ లైసెన్సు, పెనాల్టీలు రూ.68కోట్లు, టౌన్ప్లానింగ్ ఆదాయం రూ.430కోట్లు, ఇంజినీరింగ్ విభాగం ఆదాయం రూ. 180 కోట్లు, నాన్ప్లాన్ గ్రాంట్లు రూ.282కోట్లు, ప్లాన్ గ్రాంట్ రూ. 5లక్షలు అంచనా వేయగా, జీతాలు, సానిటేషన్ విభా గం, విద్యుత్ చార్జీలు, ఇంజినీరింగ్ విభాగం, పరిపాలనా నిర్వహణ, టౌన్ప్లానింగ్, పబ్లిక్ ఏమినిటీస్, వార్డు వారీగా ఖర్చులు, డిపాజిట్ల ఖర్చులు, నాన్ప్లాన్ గ్రాంట్లకు రూ.106కోట్ల 36లక్షలను అంచనా వ్యయంగా నిర్ణయించినట్లు ఇందుకు కౌన్సిల్ ఆమోదించినట్లు కమిషనర్ సత్యబాబు తెలిపారు.
రూ.56కోట్ల నిధులకు మణికొండ కౌన్సిల్ తీర్మానం..
మణికొండ మున్సిపాలిటీని ఆదర్శనీయంగా తీర్చిదిద్దుతామని మున్సిపాలిటీ చైర్మన్ కస్తూరి నరేందర్ పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో బుధవారం రూ.56కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు కౌన్సిల్ తీర్మానం చేసి ఆమోద ముద్రవేసింది. రూ.8కోట్ల నిధులతో నూతన పురపాలక సంఘ భవన నిర్మాణ మిగులు పనులు, రూ.కోటి నిధులతో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్వెజ్ మార్కెట్, రూ.2కోట్ల నిధులతో ధోబీగాట్ నిర్మాణ పనులు, రూ.2కోట్ల 23లక్షల నిధులతో కమ్యూనిటీ హాళ్ల పనులు, రూ.2కోట్ల 18లతో రోడ్ల నిర్మాణ పనులు, రూ.6కోట్ల 13ల నిధులతో పార్కుల అభివృద్ధి, రూ.17కోట్ల 69లక్షల నిధులతో ఎస్సీ శ్మశానవాటిక అభివృద్ధి, రూ.7కోట్ల 50లక్షల నిధులతో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్వెజ్ మార్కెట్కు అప్రోచ్రోడ్డు, బాక్స్ డ్రైన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. అదేవిధంగా రూ.95లక్షల నిధులతో మ్యాన్ హోల్స్ నిర్వాహణ, రూ.3కోట్ల 24లక్షలతో సానిటేషన్ పనులకు కేటాయించినట్లు కమిషనర్ ఫల్గుణ్కుమార్ తెలిపారు. రూ.2.20లక్షల నిధులతో ఎస్డబ్ల్యూడీ పైప్లైన్, రూ.9కోట్ల 80లక్షల నిధులతో పంచవటికాలనీ నాలా పై బాక్స్ డ్రైన్ పనులకు కేటాయించారు. అనంతరం మున్సిపాలిటీ కార్యాలయం పై అంతస్తులో నిర్మించిన సమావేశ గదులను చైర్మన్ కస్తూరి నరేందర్, వైస్ చైర్మన్ కె.నరేందర్రెడ్డి కౌన్సిల్ సభ్యులతో కలిసి ప్రారంభించారు. కమిషనర్ ఫల్గుణ్కుమార్, డీఈ దివ్యజ్యోతి పాల్గొన్నారు.