తెలుగుయూనివర్సిటీ, మే 31: తెలంగాణ ప్రభుత్వ జవహర్ బాలభవన్ ఆధ్వర్యంలో 5న అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పక్షుల పరిరక్షణ, చెట్లు పెంచడం వంటి అంశాలపై ఆన్లైన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు బాల భవన్ డైరెక్టర్ ఉషారాణి తెలిపారు. చిత్రలేఖనం, సైన్స్, క్విజ్, యోగా ప్రక్రియ, వ్యాసరచన, డ్యాన్స్ అంశాల్లో మంగళవారం నుంచి పోటీలు ఉంటాయన్నారు. వివరాలకు 040-23233956 నంబర్లో సంప్రదించవచ్చన్నారు.