సుల్తాన్బజార్ : తెలంగాణ రాష్ర్టాన్ని మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఈస్ట్ జోన్ డీసీపీ, జాయింట్ సీపీ రమేశ్రెడ్డి అన్నారు. శనివారం సుల్తాన్బజార్ ఏసీపీ ఆధ్వర్యంలో బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్ హాల్లో మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు, మెడికల్ ఏజెన్సీలు, మెడికల్ షాపుల నిర్వాహకులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో, నగరంలో మాదక ద్రవ్యాలను పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలన్నారు. రాష్ట్రంలో రెండు నెలలుగా గంజాయిని రూపు మాపేందుకు పోలీసుల ఆధ్వర్యంలో దాడులు జరుగుతున్నాయని, మాదక ద్రవ్యాల విక్రయదారులు మెడికల్ ఏజెన్సీల ద్వారా డ్రగ్స్ను సరఫరా చేసే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఈ అవగాహన సమావేశాన్ని నిర్వహించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ధూల్పేట్ ఎక్సైజ్ అడిషనల్ డీసీపీ నవీన్కుమార్, సుల్తాన్బజార్ ఏసీపీ దేవేందర్, ఇన్స్పెక్టర్ భిక్షంరెడ్డి, సైదాబాద్ ఇన్స్పెక్టర్ సుబ్బరామిరెడ్డి,అఫ్జల్గంజ్ ఇన్స్పెక్టర్ రవీందర్రెడ్డి, సుల్తాన్బజార్ డీఐ రాము నాయక్ తదితరులు పాల్గొన్నారు.