వనస్థలిపురం, ఆగస్టు 13: ఎలక్ట్రిక్ బైక్కు చార్జింగ్ పెడుతుండగా.. బ్యాటరీ పేలడంతో ఓ యువకుడు గాయపడ్డాడు. ఈ ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్జీవోస్ కాలనీలో ఉండే కోటేశ్వర్రావు శనివారం రాత్రి తన ఎలక్ట్రిక్ బైక్కు చార్జింగ్ పెట్టగా, బ్యాటరీ పేలి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో గాయపడ్డాడు. పోలీసులు వచ్చి పరిశీలించారు. దర్యాప్తు చేపట్టారు.