హైదరాబాద్ : మెట్రో ప్రయాణికుల కోసం మెట్రో రైడ్ పేరుతో ఎలక్ట్రిక్ ఆటో సర్వీసులు ప్రారంభం.. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు ఉంటే పంపించగలరు సర్. అయ్యాయి. మెట్రో స్టేషన్ నుంచి గమ్య స్థానానికి చేరేలా ఎలక్ట్రిక్ ఆటోలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఆటోలను పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ వద్ద మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రయివేటు ఆటోల కంటే మెట్రో ఆటోల్లో ఛార్జీలు చాలా తక్కువ అని పేర్కొన్నారు. కరోనా వల్ల హైదరాబాద్ మెట్రోకు రూ. 3 వేల కోట్ల నష్టం వచ్చిందని తెలిపారు. కరోనాకు ముందు ప్రయాణికుల సంఖ్య 4 లక్షలు ఉండేది. ప్రస్తుతం రోజుకు 2.7 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారని ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు.
మెట్రో ఫేజ్ -2 నిర్మాణంపై దృష్టి సారించామని మెట్రో ఎండీ తెలిపారు. ఫేజ్-2లో శంషాబాద్ ఎయిర్పోర్టుకు మెట్రో రైలు సేవలను విస్తరిస్తామన్నారు. రూ. 5 వేల కోట్లతో మెట్రో ఫేజ్-2 నిర్మాణానికి ప్రణాళిక రూపొందించామని చెప్పారు. అదనపు పెట్టుబడికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులో భాగస్వాములయ్యేందుకు ఎవరైనా రావొచ్చని ఎన్వీఎస్ రెడ్డి సూచించారు.