సిటీబ్యూరో: ఎలక్ట్రానిక్ మీడియా, లోకల్ కేబుల్, సోషల్ మీడియా ఇతర ఆన్లైన్ మాధ్యమాల్లో ప్రకటనలకు తప్పనిసరిగా ఎంసీఎంసీ కమిటీ ద్వారా అనుమతి తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సీపీఆర్వో కార్యాలయం ఎంసీఎంసీ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థుల ప్రకటనలకు తప్పనిసరిగా 48 గంటల ముందు ఎంసీఎంసీ అనుమతి కోసం నిర్ణీత దరఖాస్తు చేసుకోవాలన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థి గానీ తన ఏజెంట్ గానీ ఐప్లె చేసుకోవచ్చన్నారు. ప్రింటింగ్ ప్రెస్ ప్రింట్ చేసిన కరపత్రాలపై పబ్లిషర్ పేరు, అడ్రస్, హ్యాండ్ బిల్ ఇతర పత్రాలు ముద్రించిన సందర్భంలో తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించాలని సూచించారు.