బండ్లగూడ/మైలార్దేవ్పల్లి/ బడంగ్పేట: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు అంతారం నరేశ్ ఆధ్వర్యంలో జరిగిన ముఖ్యనాయకుల సమావేశంలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి.. ఓట్లు అభ్యర్థించాలని శ్రేణులకు సూచించారు.
మైలార్దేవ్పల్లిలో ఎన్నికల ప్రచార వాహనాలను ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ ప్రారంభించారు. కాగా, చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మంగళవారం రాజేందర్నగర్ తహసీల్దార్ కార్యాయలంలో నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బడుగుల గొంతుక కాసానిని ఆశీర్వదించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలన్నారు.