హైదరాబాద్ : గణేష్ ఉత్సవాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతి ఒక్కరు
మట్టి విగ్రహాలను ప్రతిష్టించి పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు. అందుకోసం అవగాహన కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. ఆరు లక్షల మట్టి విగ్రహాల పంపిణీ ప్రక్రియ కొనసాగుతుందన్నారు.
ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరుపుకునేలా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఉత్సవాల నిర్వహకులు కూడా అధికారులకు సహకరించాలని మంత్రి కోరారు.