కొండాపూర్, అక్టోబర్ 3: గుడ్డు ఎంతో బలవర్ధకమైన ఆహారమని, ప్రతి ఒక్కరూ భోజనంలో తప్పనిసరిగా తీసుకోవాలని నేషనల్ ఎగ్ కమిషన్ చైర్మన్ సురేశ్ చిట్టూరి పేర్కొన్నారు. ఆదివారం వరల్డ్ ఎగ్డేను పురస్కరించుకుని గుడ్డు విశిష్టతను వివరిస్తూ శ్రీనివాస ఫార్మ్స్, అడిసియో సంస్థలు నిర్వహించిన సైకిల్ ర్యాలీలో ఆయన పాల్గొని ప్రారంభించారు. 100కు పైగా ప్రొఫెషనల్ సైక్లిస్టులు ఈ ర్యాలీలో పాల్గొని గుడ్డు విశిష్టతను, ఆహారంలో భాగంగా గుడ్లను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. మాదాపూర్లో ప్రారంభమైన సైకిల్ ర్యాలీ గచ్చిబౌలి మీదుగా గోల్కొండ ఖిల్లా వరకు నిర్వహించినట్లు సురేశ్ పేర్కొన్నారు.