కాజీపేట, మే 3: హైదరాబాద్ తర్వాత రెండో రాజధానిగా పిలువబడుతున్న వరంగల్ నగరంలో నారాయణ ఇంటర్మీడియట్ విద్యా సంస్థలను ప్రారంభిస్తున్నట్లు ఆ సంస్థ చైర్మన్, ప్రతినిధి పొంగూరి నారాయణ, సింధూ తెలిపారు. కాజీపేట పట్టణ శివారు 61వ డివిజన్లోని పాత రిజిస్ట్రేషన్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నారాయణ విద్యాసంస్థల కార్యాలయంలో సోమవారం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో జిల్లాకు చెందిన విద్యార్థులు హైదరాబాద్కు రాలేని కారణంగా నగరంలో విద్యా సంస్థలను ఏర్పాటు చేశామన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సంస్థ ప్రతినిధులు ప్రమీల, గోపాల్రెడ్డి, రాజేశ్రెడ్డి, రామకృష్ణ, అనిల్ పాల్గొన్నారు.