కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 29 : ఆ కాలనీలకు తలభాగానే పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది.. జ్వరమొచ్చినా..నొప్పొచ్చినా అత్యవసరంగా ఆసుపత్రికి వెళ్లాలంటే ఆ కాలనీల గుండా అంబులెన్స్ వెళ్లేందుకు సైతం అవకాశం లేకుండా ఉండేది… ఆటో, ఇతరత్రా వాహానాల మీద వచ్చినా దాదాపుగా 45 నిమిషాలకు పైగా సమయం పడుతుంది…ఇక వర్షాలు పడిన సమయంలో ఆ కాలనీల్లో ప్రవహించే వరద నీటిప్రవాహాన్ని తట్టుకొని బయటకు వెళ్లాలంటే గగనమే.. ఇలా.. ఏండ్ల తరబడి ఆ కాలనీల వాసులు తమ గమ్యస్థానాలను చేరుకునేందుకు నానా అవస్థలు పడేవారు. ఆ కాలనీలగుండా వెళ్లేందుకు పిల్లబాట(తాటిచెట్టు మొద్దు) సహకారంతో కొన్ని రోజు లు కాలినడకన వచ్చేవారు. ఆ తర్వాత కొన్ని ప్రత్యామ్నా య మార్గాల ద్వారా తమ రాకపోకలు సాగించేవారు. సమస్యను గుర్తించిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆలోచనతో అక్కడి జనాల రాకపోకలకు దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించారు. రూ.49 లక్షల వ్యయం తో జీడిమెట్ల డివిజన్, భూమిరెడ్డినగర్-న్యూవివేకానందనగర్ కాలనీల మధ్య ఉన్న నాలా కల్వర్టు నిర్మాణం చేపట్టారు. అంబులెన్స్, కార్లు, ఇతర వాహనాలు వెళ్లేందుకు పనులు పూర్తి చేయించారు. ఇప్పుడు ఆ దారి దాదాపుగా ఐదారు కాలనీల వాసులకు అందుబాటులోకి వచ్చింది..
జీడిమెట్ల డివిజన్ పరిధిలోని భూమిరెడ్డినగర్లో నిర్మించిన కల్వర్టు నిర్మాణం ద్వారా దానికి కిందిభాగాన ఉన్న న్యూ వివేకానందనగర్, వెంకన్నహిల్స్, దత్తాత్రేయనగర్, శివారెడ్డినగర్, శ్రీనివాస్నగర్ ప్రాంతాల్లోని ప్రజల రాకపోకలకు అనువుగా ఉంది. కుత్బుల్లాపూర్ విలేజ్లో ఉన్న ప్రభుత్వ పట్టణ ఆరోగ్య ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తో పాటు కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయం, ప్రధాన రహదారికి వెళ్లేందుకు కేవలం ఐదు నిమిషాల్లోనే చేరేందుకు అనువుగా తీర్చిదిద్దారు. భవిష్యత్ తరాలకు అనుగుణంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజల అవసరాల మేరకు వెడల్పుగా సీసీరోడ్డు నిర్మాణంతో పాటు కల్వర్టు నిర్మాణాన్ని పూర్తి చేశారు.
ఎన్నో ఏండ్లుగా తమ కాలనీల నుంచి బయటకు వెళ్లాలంటే ఎదుర్కొనే ఇబ్బందులను కల్వర్టు నిర్మాణంతో పూర్తి చేశారు. దీంతో ఆయా కాలనీవాసులు హర్షం వ్య క్తం చేస్తూ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అత్యవసర సమయంలో బయటకు వెళ్లాలంటే గగనమైన తమ ప్రయాణాన్ని సులువు చేయడం ద్వారా సంతోషంగా ఉందని తెలిపారు. ఎమ్మెల్యేకు రుణపడి ఉంటామని కాలనీవాసులు అన్నారు.