హైదరాబాద్ : హాష్ ఆయిల్ కేసులో కీలక సూత్రధారి లక్ష్మీపతిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన లక్ష్మీపతిని హైదరాబాద్ నార్కోటిక్ విభాగానికి చెందిన పోలీసులు ఏపీలో అరెస్టు చేశారు. హాష్ ఆయిల్ ఎక్కడ్నుంచి తీసుకొస్తున్నాడు.. ఎవరెవరికి సరఫరా చేస్తున్నాడన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మీపతి నుంచి వంద మంది వరకు హాష్ ఆయిల్ కొనుగోలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కిలో హాష్ ఆయిల్ను రూ. 6 లక్షలకు విక్రయించినట్లు గుర్తించారు.
ఈ కేసులో ఇప్పటికే లక్ష్మీపతి స్నేహితుడు ప్రేమ్ ఉపాధ్యాయతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. మాదాపూర్, కొండాపూర్, నార్సింగి ఏరియాల్లో రూమ్లను కిరాయికి తీసుకొని, అక్కడ పార్టీలు ఏర్పాటు చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగులను ఆహ్వానిస్తున్నాడని పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ అధిక మోతాదులో వాడిన కారణంగా నల్లకుంటకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన ఘటనతో లక్ష్మీపతి పేరు బయటకు వచ్చింది.