హయత్నగర్,నవంబర్ 28: హయత్నగర్ డివిజన్లోని దత్తాత్రేయనగర్ కాలనీలో మార్చి వరకు డ్రైనేజీ నిర్మాణ పనులను పూర్తి చేస్తామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి హామీనిచ్చారు. ఆదివారం హయత్నగర్లోని దత్తాత్రేయనగర్ కాలనీకి నూతనంగా ఏర్పాటు చేసిన ముఖద్వారం(ఆర్చీ) ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి హాజరై మాట్లాడుతూ కాలనీలో ఇతర సమస్యలను కూడా దశలవారీగా పరిష్కరిస్తామని తెలిపారు. అనంతరం కాలనీకి ఇండ్ల పెద్ద భిక్షమయ్య, కిష్టమ్మ జ్ఞాపకార్థంతో ఏర్పాటు చేసిన ముఖద్వారం దాతలు ఇండ్ల ఏడుకొండలు, వీణ దంపతులను ఎమ్మెల్యే సుధీర్రెడ్డి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో హయత్నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్రెడ్డి, మాజీ కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు చెన్నగోని శ్రీధర్గౌడ్, సీనియర్ నాయకులు భాస్కర్ సాగర్, సింగిరెడ్డి మల్లీశ్వరిరెడ్డి, నక్క రవీందర్గౌడ్, కాటెపాక స్కైలా బ్, పారంద రమేశ్, ప్రధాన కార్యదర్శి యానాల కృష్ణారెడ్డి, యూత్ అధ్యక్షుడు డ్యాగల రాకేష్, మహిళా అధ్యక్షురాలు అంజలి, మాజీ అధ్యక్షుడు గుడాల మల్లేశ్ ముదిరాజ్, గుడాల సందీప్ ముదిరాజ్, మనోజ్, మధు, పరమేశ్గౌడ్, దత్తాత్రేయ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పి.వెంకట్రెడ్డి, ప్రధాన కార్యదర్శి డి.రమేశ్, ట్రెజరర్ శోభన్, ఉపాధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, యాదగిరిరెడ్డి, కిరణ్, శ్రీశైలం, రామస్వామి, మహిళా కార్యదర్శులు అమరావతి, మౌనిక, రజని, విజయలక్ష్మి, కవిత, నాగమణి, గౌరవ అధ్యక్షుడు ఇండ్ల ఏడుకొండలు, శిరీష, శ్రీవాణి, యామిని, కవిత తదితరులు పాల్గొన్నారు.