ఉప్పల్ జోన్ బృందం, డిసెంబర్ 6 : భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతిని మంగళవారం ఉప్పల్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప్పల్, రామంతాపూర్, చర్లపల్లి, కాప్రా, నాచారం, చిలుకానగర్ తదితర డివిజన్లలోని అంబేద్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు కార్పొరేటర్లు, నాయకులు పూలమాలలువేసి నివాళులర్పించారు. అంబేద్కర్ సేవలు స్ఫూర్తిదాయకమని.. అనగారిన వర్గాల సామాజిక, ఆర్థిక, సాధికారత కోసం జీవితాంతం పరితపించిన మహనీయుడని, ప్రపంచం గర్వించదగిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారని పలువురు అన్నారు.
ఉప్పల్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహాలకు చిలుకానగర్ షెడ్యూల్ కులాల సేవా సం ఘం ఆధ్వర్యంలో, పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నేతలు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, నరసింహ, కొండల్రెడ్డి, జగన్, నర్సింగరావు, యాదగిరి, పుష్పరాజ్, శ్యామ్, అంజన్కుమార్, పల్లె నర్సింగ్రావు, అశోక్, రామచందర్, బలరాం, మహేందర్ పాల్గొన్నారు.
అంబేద్కర్ విగ్రహానికి కా ర్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకు లు బుర్ర రాజేశ్వర్, దొడ్డి జంగయ్య, రాములు, వేముల వెంకట్రెడ్డి, తాళ్ల బాలకృష్ణగౌడ్, దయానంద్రెడి, నారాయణదాసు, ఉపేందర్యాదవ్, భాస్కరాచారి, నిరంజన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ విగ్రహానికి కార్పొరేటర్లు పన్నాల దేవేందర్రెడ్డి, జెర్రిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ గొల్లూరి అంజయ్యలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పర్నాటి నరేందర్, కుంటి కృష్ణ, వాసుగౌడ్, విజయ్, కృష్ణయాదవ్, శ్రీశైలం, కుమార్యాదవ్, మల్లేశ్, శంకర్, జయరా జ్, రఘు, నర్సింహ, తదితరులు పాల్గొన్నారు.
హెచ్బీకాలనీ డివిజన్ వార్డు కార్యాలయం ఆవరణలో అంబేద్కర్ చిత్ర పటానికి కార్పొరేటర్ ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్రెడ్డి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో బాల్రాజ్, అలీమొద్దీన్, మల్లేశ్, యాదగిరి, నవీన్గౌడ్, మల్లేశ్గౌడ్, కుమార్, శేఖర్గౌడ్, జ్యోతి, రాజ్కుమా ర్, జయపాల్, తదితరులు పాల్గొన్నారు.
డివిజన్, నెహ్రూనగర్లో అంబేద్కర్, జగ్జీవన్రామ్ జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ నాగిరం బాబు మాదిగ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘ సేవకుడు బోదాసు లక్ష్మీనారాయణ, దుర్గయ్య, జగన్, రమణ, శంకర్నాయక్, బస్తీవాసులు పాల్గొన్నారు.
డివిజన్, కందిగూడలోని అంబేద్కర్ విగ్రహంతో పాటు పలు ప్రాంతాల్లోని అంబేద్కర్ విగ్రహాలకు కార్పొరేటర్ స్వర్ణరాజు శివమణి పూలమాలలు నివాళులర్పించారు. కార్యక్రమంలో విష్ణు, పవన్కుమార్, బాబురావు, రాఘవులు, శేఖర్, సురేశ్కుమార్, ఆర్.ఎల్.కుమార్, శ్రీధరన్, దండు, శంకర్రావు, రవి, రోహన్సురేశ్, అజయ్, రాకేశ్ పాల్గొన్నారు. సాయిబాబానగర్లోని అంబేద్కర్ విగ్రహానికి టీఆర్ఎస్ నాయకులు సోమ్నాథ్, తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీనగర్ కమ్యూనిటీహాల్లో వివిధ పార్టీల నాయకులు, యూ త్ అసోసియేషన్ ప్రతినిధులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.