తెలుగుయూనివర్సిటీ, జూన్ 24: డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రంలో డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం ఇంటర్మీడియట్, ఓపెన్ ఇంటర్, ఐటీఐ డిప్లొమా కోర్సుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని అధ్యయన కేంద్రం ప్రిన్సిపాల్ డాక్టర్ డి. వరలక్ష్మి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నాంపల్లిలోని ఇందిరాప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని అధ్యయన కేంద్రంలో బీఏ, బీకామ్, బీఎస్సీ, స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ఉన్నాయన్నారు. 2020-21 విద్యాసంవత్సరం మొదటి సంవత్సరంలో అడ్మిషన్ పొందిన విద్యార్థినులు రెండో సంవత్సరం ట్యూషన్ ఫీజును, అంతకుముందు అడ్మిషన్లు పొంది సకాలంలో చెల్లించలేకపోయిన వారు ఆగస్టు 12లోపు ఆన్లైన్లో చెల్లించాలని సూచించారు. సమాచారం కోసం www.braouonline.inలో గాని 7382929626, 9676595084 నంబర్లో సంప్రదించవచ్చని అధ్యయన కేంద్రం సమన్వయకర్త హర్బన్స్ కౌర్ తెలిపారు.