బన్సీలాల్పేట్, జూలై 4: పేదల బస్తీలు రూపురేఖలు మార్చుకుని ఆత్మ గౌరవంతో తలెత్తుకొని నిలబడుతున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా సీఎం కేసీఆర్ చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకంతో మెరిసిపోతున్నాయి. ముఖ్యంగా బన్సీలాల్పేట డివిజన్లోని గొల్ల కొమరయ్య కాలనీలో రూ.85 లక్షలతో నిర్మించిన పది డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 10 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కలెక్టర్ శ్వేతా మహంతి, మేయర్ విజయలక్ష్మి, ఇతర ప్రముఖులు లబ్ధిదారులకు డబుల్ ఇండ్లను అందివ్వనున్నారు.
అయితే ఈ ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి పూర్తి అయ్యే వరకు మంత్రి తలసాని దగ్గరుండి పనులను పర్యవేక్షించడంతో పాటు సకాలంలో పూర్తి చేయడంలో తన వంతు పాత్ర పోషించారని.. మంత్రి చేసిన సేవలకు తాము ఎళ్లప్పుడు రుణపడి ఉంటామని గొల్ల కొమరయ్య కాలనీ అధ్యక్షుడు కేఎమ్. కృష్ణ, కార్యదర్శి ఈ. నర్సింగ్ తెలిపారు.