మియాపూర్ : శ్రామిక శక్తిని మించిన ఆస్తి మరొకటి లేదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. శ్రామికుల శ్రమను గుర్తించాలని, వారిని గౌరవించాలని పిలుపునిచ్చారు. మేడేను పురస్కరించుకుని సంఘటిత ,అసంఘటిత రంగంలో పని చేస్తున్న కార్మికులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు ఆదివారం విప్ గాంధీ మాట్లాడుతూ తమ హక్కుల కోసం కార్మికుల పోరాటం మేడేగా ఉధ్భవించిం దని, కార్మిక శక్తి అపారమైదన్నారు. కార్మిక లోకం అంతా ఆరోగ్యాలతో ఆర్థికంగా బలపడాలని తాను ఆకాంక్షిస్తు న్నట్లు విప్ గాంధీ పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం విశేషమైన కృషి చేస్తున్నదన్నారు.