ఆటిజం వంటి నరాల సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్న పిల్లలకు హోమియోపతి వైద్యం ద్వారా నయం చేస్తున్న డాక్టర్ కేర్ హోమియోపతి ఫౌండర్ డాక్టర్ ఏఎం రెడ్డి సేవలను బ్రిటీష్ పార్లమెంట్ గుర్తించింది. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఆటిజం సెంటర్(పాజిటివ్ ఆటిజం) స్థాపించి… హోమియోపతిక్ ఇమ్యూనోథెరపీతో విజయవంతంగా వేలాది మంది ఆటిస్టిక్ పిల్లలకు చికిత్స అందించారు. ఆటిజం నిర్మూలనకు విశేష కృషి చేస్తున్న డాక్టర్ ఏఎం రెడ్డికి బ్రిటీష్ పార్లమెంట్ అవార్డు ప్రకటించింది.
10 సంవత్సరాలుగా 143 ఆటిజం కేసులపై పరిశోధన నిర్వహించి, గర్భం ధరించాక మందులు వాడటం, ఏడీహెచ్డీ హైపరాక్టివిటీకి ప్రాథమిక మూల కారణం అని కనుగొన్నారు. ఈ పరిశోధన పత్రాన్ని బ్రిటీష్ పార్లమెంట్లో అవార్డు ప్రదానోత్సవం సందర్భంగా ఏఎం రెడ్డి సమర్పించనున్నారు. చిన్నారుల మెరుగైన భవిష్యత్ కోసం గర్భిణీ స్త్రీలకు జీరో మెడికేషన్ మెథడ్ని ప్రచారం చేయడం ద్వారా ఆటిజంను నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఏఎం రెడ్డి.