అమీర్పేట్ : వివిధ ప్రాంతాల నుండి నగరానికి వచ్చి స్థిరపడ్డ ఎవరైనా తెలంగాణకు చెందిన వారిగానే ప్రభుత్వం పరిగణిస్తుందని, అటువంటి వారి భద్రత పట్ల ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ స్పష్టం చేశారు. ఈ విషయంలో స్థానికేతరులంటూ ఎవరైనా ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు.
రాంగోపాల్పేట్ డివిజన్లోని సింధికాలనీ జవహర్నగర్లో జైన్ సమాజం ప్రతినిధులచే జరుగుతున్న జైన్ మందిర్ నిర్మాణాలకు స్థానికులు కొందరు ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ నగర నలుమూలల నుండి వచ్చిన జైన్ ప్రతినిధులు గురువారం ఉదయం మంత్రి తలసానిని ఆయన నివాసంలో కలుసుకుని పరిస్థితులను వివరించారు.
వెంటనే స్పందించిన మంత్రి తలసాని అక్కడే ఉన్న రాంగోపాల్పేట్ ఏసీపీ రమేష్కు సమస్యను వివరిస్తూ.. జైన్ మందిర నిర్మాణాలకు అడ్డంకులు సృష్టిస్తున్నది ఎంతటి వారైనా ఉపేక్షించకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏ ప్రాంతం నుండి వచ్చిన వారైనా అభద్రతా భావాలు లేకుండా తెలంగాణలో ప్రశాంత జీవనం గడిపేలా పరిస్థితులుండాన్నారు.
ఇటువంటి ప్రశాంతకర వాతావరణానికి భంగం వాటిల్లితే అందుకు కారకులు ఎతటి వారైనా ఉపేక్షించేది ఉండదని స్పష్టం చేశారు. జైన్ మందిరం నిర్మాణాలు పూర్తయ్యే వరకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, ఎవరైనా ఇబ్బందులు సృష్టిస్కేత చట్టపరమైన అన్ని చర్యలు తీసుకోవాలంటూ ఏసీపీ రమేష్ను ఆదేశించారు.
మంత్రి తలసానిని కలిసిన వారిలో జైన్ సేవా సంఘ్ కార్యదర్శి అమిత్ ముత్, బసంత్ బఫ్నా, యోగేష్కర్ గాంధీ, మహవీర్ తాటేడ్, సురందర్ పిపారా, విజయ్వర్ధన్, ముఖేష్ హాన్, ఆర్కే జైన్, రితేష్ జాగిర్దార్, ప్రభు, జీతూజైన్, రిసపబ్ మెహతా తదితరులున్నారు.