మేడ్చల్, డిసెంబర్9(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములు కబ్జాకు గురికాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ గౌతమ్ పేర్కొన్నారు. అద్రాస్పల్లి గ్రామంలోని సర్వే నంబర్ 235లో ఉన్న 15 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎవరూ ఆక్రమించకుండా అవసరమైన చర్యలు చేపట్టామని, అందుకు ప్రత్యేకంగా కీసర ఆర్డీవో రాజేశ్కుమార్కు బాధ్యతలు అప్పగించినట్లు వివరించారు.
భూములను సర్వే చేయిస్తున్నామని, సర్వేలో కబ్జాకు పాల్పడినట్లు తెలితే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుని భూములను స్వాధీనం చేసుకుంటామన్నారు. ఈ ప్రాంతంలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూములకు సంబంధించి అందరికి న్యాయం జరిగేలా చూస్తామని, స్థానికులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. భూములకు సంబంధించి పూర్తి వివరాలను కీసర ఆర్డీవో రాజేశ్కుమార్కు అందజేయాలని ఆదేశించినట్లు కలెక్టర్ గౌతమ్ వెల్లడించారు.