సికింద్రాబాద్/బౌద్ధనగర్, నవంబర్ 24: పేదలకు కొండంత అండగా రాష్ట్ర సర్కారు అందజేస్తున్న సంక్షేమ పథకాలు ఎంతో భరోసాను ఇస్తున్నాయని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత అన్నారు. గురువారం తార్నాక డివిజన్లోని లాలాపేట ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డులను లబ్ధిదారులకు టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డితో కలిసి డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్ రెడ్డి మాట్లాడుతూ.. సంక్షేమ కార్యక్రమాల అమలులో తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. అర్హులందరూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత పేదల కష్టాలు తీర్చేందుకు అనేక సంక్షేమ పథకాలను సీఎం ప్రవేశపెట్టారన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు తదితర పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. ఈ కార్యక్రమంలో మారేడ్పల్లి తహసీల్దార్ మాధవిరెడ్డి, రెవెన్యూ అధికారులు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.