కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి
సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ
జవహర్నగర్, డిసెంబర్ 11: అనారోగ్య సమయంలో నిరుపేదలను ముఖ్యమంత్రి సహాయనిధి ఆదుకుంటున్నదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ నియోజకవర్గానికి చెందిన పలువురు అనారోగ్య నిమిత్తం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు మంత్రి శనివారం అందజేశారు. జవహర్నగర్ కార్పొరేషన్కు చెందిన సుబ్బరత్నమ్మకు రూ.1.50 లక్షలు,షేక్ తయాబహకు రూ. లక్ష సీఎం సహాయనిధి నుంచి చెక్కులు మంజూరయ్యాయి. ఈ చెక్కులను శనివారం మంత్రి నివాసంలో మేయర్ కావ్య, డిప్యూటీ మేయర్ శ్రీనివాస్గుప్తా సమక్షంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ఏకే మురుగేశ్, నిహారిక, సంగీతా రాజశేఖర్, నాయకులు రమేశ్చారి, 7వ డివిజన్ అధ్యక్షుడు వెంకన్న, 28 డివిజన్ అధ్యక్షుడు వెంకటేశ్ పాల్గొన్నారు.
కీసర మండలానికి చెందిన ముగ్గురికి…
మండల పరిధిలోని అంకిరెడ్డిపల్లికి చెందిన మల్యాల చిత్తారికి రూ.2లక్షలు, సింగారం అశోక్కు రూ.లక్ష, ఇస్తారి శ్రీనాథ్కు రూ.50వేలు సీఎం సహాయనిధి నుంచి చెక్కులు మంజూరయ్యాయి. ఈ చెక్కులను మంత్రి చామకూర మల్లారెడ్డి తన నివాసంలో లబ్ధిదారులకు శనివారం అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్, మండల పార్టీ అధ్యక్షుడు జె.సుధాకర్రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నారాయణ, నాయకులు మహేశ్, లింగేశ్వర్, ప్రశాంత్, శ్రీశైలం, దాసు, సింగారం, లక్ష్మణ్ పాల్గొన్నారు.
జవహర్నగర్కు చెందిన రాకేశ్కు…
శామీర్పేట : శామీర్పేట ఎంపీపీ ఎల్లూబాయిబాబు వినతి మేరకు జవహర్నగర్కు చెందిన రాకేశ్శర్మ అనారోగ్య నిమిత్తం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆయనకు మంజూరైన రూ.3 లక్షల ఎల్వోసీ మంజూరు పత్రాన్ని మంత్రి మల్లారెడ్డి లబ్ధిదారుడికి శనివారం అందజేశారు.