ఆర్కేపురం : టీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు పటోళ్ల కార్తీక్రెడ్డి 38వ జన్మదిన వేడుకలను మంగళవారం టీఆర్ఎస్ జిల్లా నాయకులు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నెంటూరి రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్గీయ మాజీ హోమంత్రి పటోళ్ల ఇంద్రారెడ్డి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం పార్టీ శ్రేణుల సమక్షంలో కేక్ కట్చేసి సంబురాలు జరుపుకొని యాదవ్నగర్ కాలనీలోని సిరి ఓల్డేజీ హోమ్లో దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రవీందర్రెడ్డి మాట్లాడుతూ కార్తీక్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో చిన్న వయస్సులోనే మంచి పేరు తెచ్చుకొని ప్రజలకు సేవ చేయడంలో ముందు వరుసలో ఉన్నాడని కొనియాడారు. భవిష్యత్తులో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, సబితాఇంద్రారెడ్డి ఆశీర్వాదంతో మంచి పదవులను చేపట్టాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వీరమళ్ల రామ్ నర్సింహగౌడ్, చిత్రలేఅవుట్ కాలనీ అధ్యక్షుడు ముస్కు అంజిరెడ్డి, ఆర్కేపురం డివిజన్ టీఆర్ఎస్ యూత్ ప్రధాన కార్యదర్శి చిన్నమ్మా రమేష్ కుర్మ, నాయకులు బీరెల్లి వెంకట్రెడ్డి, మారోజు రామాచారి, పుష్షలతారెడ్డి, న్యాలకొండ .శ్రీనివాసరెఢ్డి, ముప్పిడి లింగస్వామిగౌడ్, కొండ్ర శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.