సిటీబ్యూరో, జనవరి 20 (నమస్తే తెలంగాణ) : జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హాజింగ్ సొసైటీ డైరెక్టర్ పోస్టులకు ఎన్నికలు నిర్వహించడానికి అడ్హక్ బోర్డును ఏర్పాటు చేయాలని సహకార శాఖ నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా సహకార శాఖ రిజిస్ట్రార్ డి.రమాదేవి శనివారం నోటీసులు జారీ చేశారు. ఆ శాఖ అధికారి రమాదేవితో పాటు డిప్యూటీ రిజిస్ట్రార్ వెంకట్రెడ్డి, నిజాంపేట్లోని జేఎన్జే కార్యాలయానికి వెళ్లి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఆ వెంటనే నోటీసు జారీ చేశారు.
ఫిబ్రవరి 4న ఉదయం 11.30 గంటలకు జేఎన్జే సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు రమాదేవి నోటీసులో పేర్కొన్నారు. అయితే జేఎన్జే స్థలంలోనే సర్వసభ్య సమావేశం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో అడహక్ బోర్డును ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశానికి సహకార శాఖ సికింద్రాబాద్ డిప్యూటీ రిజిస్ట్రార్ కన్వీనర్గా వ్యవరిస్తారు. ఈ బోర్డు జేఎన్జే మ్యాక్ హౌజింగ్ సొసైటీకి ఐదు డైరెక్టర్ పోస్టులకు ఎన్నికల నిర్వహిస్తుంది. అయితే నెల రోజుల్లోగా ఎన్నికల ప్రక్రియ ఈ బోర్డు పూర్తి చేయాల్సి ఉంది.
ఎంతోకాలంగా జేఎన్జే హౌజింగ్ సొసైటీకి నూతన కమిటీ ఏర్పాటు చేయాలని టీమ్ జేఎన్జే చేసిన పోరాటానికి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి టీమ్ జేఎన్జే కృతజ్ఞతలు తెలిపింది. సభ్యులంతా ఫిబ్రవరి 4న జరిగే సర్వసభ్య సమావేశంలో తప్పనిసరిగా పాల్గొని బోర్డు ఎంపికకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.