బంజారాహిల్స్, మార్చి 22 : బంజారాహిల్స్ రోడ్ నం.10లోని కేర్ అవుట్ పేషెంట్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన డయాబెటిక్ ఫుట్-ఊండ్ క్లినిక్ను నేషనల్ పోలీస్ అకాడమి ఇన్చార్జి డైరెక్టర్ అమిత్ గార్గ్, కేర్ ఆస్పత్రి సీఈవో జస్దీప్ సింగ్తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా జస్దీప్ సింగ్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో 10మందిలో ఆరుగురు మధుమేహం భారిన పడుతున్నారని, సరైన చికిత్స చేయించుకోకపోతే పాదాలు తొలగించాల్సిన ప్రమాదం ఏర్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లినికల్ డైరెక్టర్ డా.పీసీ.గుప్తా తదితరులు పాల్గొన్నారు.